Saturday, April 20, 2024

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Two terrorists killed in encounter at Jammu and Kashmir

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాడని స్థానిక ఐజిపి విజయ్‌కుమార్ తెలిపారు. షోపియాన్‌లో శనివారం సాయంత్రం మొదలైన ఎన్‌కౌంటర్ ముగిసిందని ఆయన తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు ఇనాతుల్లాషేఖ్ అని, ఇతడు 2018లో పాకిస్థాన్ వెళ్లి శిక్షణ తీసుకున్నాడని, హిజ్బుల్‌కు చెందిన ఇతడు గత వారమే తిరిగి వచ్చాడని విజయ్‌కుమార్ తెలిపారు. మరొకరు లష్కరే తోయిబాకు చెందిన అదిల్‌మాలిక్ అని తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలంలో ఒక ఎకె47, ఒక ఎం4 రైఫిల్, మరో పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా పింకూకుమార్ అనే ఆర్మీ జవాన్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని ఆయన తెలిపారు.

Two terrorists killed in encounter at Jammu and Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News