- Advertisement -
రాజన్న సిరిసిల్ల: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషాద సంఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. వైద్యం వికటించడమే వీరి మృతికి కారణమని తెలుస్తోంది. మృతుల్లో ఒకరు రుద్రంగి మండలం మానాలకు చెందినా షీలా, మరొకరు సిరిసిల్ల గణేశ్ నగర్ కు చెందిన కల్పనగా అధికారులు తేల్చారు. శస్త్రచికిత్స వికటించడం మృతిచెందారంటూ కుటుంబసభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -