Friday, March 29, 2024

చెలరేగుతున్న ఆసీస్ బౌలర్లు.. కష్టాల్లో భారత్

- Advertisement -
- Advertisement -

U19 World Cup 2020

 

పోట్చెఫ్‌స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా ఇక్కడి సెన్వెస్ పార్క్ స్టేడియంలో ఆథిత్య జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ పదో ఓవర్ లో జట్టు స్కోరు 35 పరుగుల వద్ద ఓపెనర్ దివ్యన్ష్ సక్సేనా(14) పెవిలియన్ చేరడంతో భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ తిలక్ వర్మ(2), ప్రియమ్ గార్గ్(5)లు వెంటవెంటనే ఔటయ్యారు. మరోవైపు అర్థ సెంచరీ బాది జోరుమీదున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్(62) కూడా వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన దృవ్ జురెల్(15) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. దీంతో భారత్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం భారత్ 32 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో సిద్దేశ్ వీర్(10), అధర్వ(0)లు ఉన్నారు.

U19 World Cup 2020: IND loss 5 wickets at 119 against AUS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News