Friday, April 19, 2024

పాక్ విద్యా సంస్థల్లో నమోదు చేసుకోవద్దని భారతీయ విద్యార్థులకు హెచ్చరిక!

- Advertisement -
- Advertisement -

studying in China and Pak

 

న్యూఢిల్లీ: భారత పౌరులు ఉన్నత విద్య కోసం పాకిస్థాన్‌కు వెళ్లవద్దని యూజిసి, ఎఐసిటిఈ  శుక్రవారం అడ్వయిజరీ(సలహా) జారీ చేశాయి. కమిషన్, తన నోటీసులో, పాకిస్తాన్‌లోని విద్యా సంస్థ నుండి డిగ్రీ పొందిన భారతీయ పౌరులు లేదా భారతదేశంలోని విదేశీ పౌరులు “భారతదేశంలో ఉపాధి లేదా ఉన్నత చదువులు కోరుకోవడానికి అర్హులు కాదు, అయితే, వలసదారులు మరియు పాకిస్తాన్‌లో ఉన్నత విద్య డిగ్రీని పొందిన, భారతదేశం పౌరసత్వం పొందిన వారి పిల్లలు హోం మంత్రిత్వ శాఖ  నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందిన తర్వాత భారతదేశంలో ఉపాధిని పొందేందుకు అర్హులు” అని నోటీసు పేర్కొంది.

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) సంయుక్త సలహా జారీ చేసిన ఒక నెలలోపు ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ-  చైనాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులను హెచ్చరించింది, ఇది “ ముందస్తు అనుమతి లేకుండా ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే కోర్సులు పూర్తి చేసిన డిగ్రీని గుర్తించడం లేదు’ అని పేర్కొంది. కొవిడ్-19  కారణంగా చైనా ప్రభుత్వం నవంబర్ 2020 నుండి అన్ని వీసాలను రద్దు చేసిన తర్వాత విద్య కోసం చైనాకు వెళ్లకూడదని అడ్వయిజరీ జారీ అయింది.

యూజిసి ఛైర్మన్ జగదీశ్  కుమార్ తన మనోభావాన్ని తెలుపుతూ, “యూజిసి మరియు ఎఐసిటిఈ దేశం వెలుపల ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి బహిరంగ నోటీసులను జారీ చేస్తున్నాయి” అని అన్నారు. ఇదిలావుండగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లలో చదువుకోవద్దని యూజిసి 2019లో సలహా ఇచ్చింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News