Tuesday, April 23, 2024

యుజిసి-నెట్ వాయిదా

- Advertisement -
- Advertisement -

UGC-NET postponed in view of Covid-19

 

న్యూఢిల్లీ: యుజిసి-నెట్‌ను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్‌పోఖ్రియాల్ తెలిపారు. కొవిడ్19 ఉధృతి కారణంగా అభ్యర్థుల ఆరోగ్యరక్షణ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గత షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా యుజిసినెట్‌ను మే 2నుంచి 17వరకు నిర్వహించాలి. తదుపరి షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) త్వరలో ప్రకటిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఎన్‌టిఎ తాజా ఆదేశాలమేరకు పరీక్షలకు 15 రోజులముందే షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. పలు సబ్జెక్టుల్లో పిజి పూర్తి చేసినవారికి యూనివర్సిటీల్లో బోధనార్హతను నిర్ణయించేందుకు ఈ పరీక్షల్ని నిర్వహిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News