- Advertisement -
బ్రిటన్ కోర్టుకు డమ్మీ డైరెక్టర్ వీడియో
లండన్ : పంజాన్ నేషనల్ బ్యాంక్కు వేలాది కోట్లు రుణం మోసం చేసిన కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీని లండన్ నుంచి భారత్కు రప్పించేందు కు సిబిఐ ప్రయత్నాలు వేగవం తం చేసింది. నీరవ్పై కేసు విచారణలో భాగంగా బ్రిటన్ కోర్టులో పలు విషయాలను సిబిఐ బట్టబయ లు చేసింది. నీరవ్ తమను చంపుతామని బెదిరించిన విషయాన్ని ఆ డైమండ్ వ్యాపారికి చెందిన కంపెనీల డమ్మీ డైరెక్టర్లు కోర్టు విన్నవించారు.
వీడియో కాల్ ద్వారా బెదిరించడాన్ని డమ్మీ డైరెక్టరు రికార్డు చేయగా, వీటిని సిబిఐ బ్రిటన్ కోర్టుకు చూపించింది. మనీ లాండరిం గ్, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ వ్యవహారాన్ని ఆరుగురు భారతీయుల బృందం వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు తెలియజేశారు. భారత్లో మోసం బయటపడడంతో నీరవ్ లండన్కు పారిపోయిన విషయం తెలిసిందే.
UK court played video of Nirav threats to dummy
- Advertisement -