Saturday, April 20, 2024

సిఎం కెసిఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు

- Advertisement -
- Advertisement -
UNESCO recognition for Ramappa due to efforts of CM KCR
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల పేర్కొన్నారు. ఆయన తన బృందంతో కలిసి రామప్పను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు టాక్, ఎన్నారైల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతాభివందనలు తెలియజేశారు. రామప్పకు గుర్తింపు రావడం వరంగల్ బిడ్డగా తనకు గర్వంగా ఉందన్నారు. యునెస్కో కోసం కృషి చేసిన స్థానిక నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు యునెస్కో గుర్తింపు లభించిన చారిత్ర కట్టడంగా రామప్ప ఉండడం సంతోషంగా ఉందని, నేటి గుర్తింపుతో రామప్ప పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రపంచ పర్యాటకులను ఆకర్శిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. టాక్ ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల మాట్లాడుతూ నేడు టాక్ బృందంతో కలిసి రామప్పను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని మన సంస్కృతీ, సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పంతో పని చేస్తున్న టాక్ సంస్థ, రామప్ప గొప్పతనం తో పాటు పర్యాటకంగా విదేశీలు సందర్శించే విధంగా ప్రత్యేకంగా కృషి చేస్తామని సత్యమూర్తి తెలిపారు.

చాలా గర్వంగా ఉంది: సతీష్ రెడ్డి

టాక్ సంయుక్త కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపబడడం చాలా గర్వంగా ఉందని , నేటి గుర్తింపుతో సాంస్కృతిక సంపదను రాబోయే తరాలకు అందించడానికి ఎంతో సాయ పడుతుందని ఆయన తెలిపారు. ఎన్నారైలంతా బాధ్యతతో రామప్పను ప్రపంచ వేదికల్లో మరింత ప్రచారం చేసి పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కృషి చెయ్యాలని ఆయన పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. రామప్పను పర్యటించిన బృందంలో టాక్ వ్యవస్థాపకులు, ఎన్నారై అనిల్ కూర్మాచలం, ఎన్నారై టిఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ సంయుక్త కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, శ్రీనివాస్ వల్లాల తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News