Thursday, April 25, 2024

రైల్వే భూముల విధానాలపై కేంద్రం కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Union Cabinet lowers railway land licensing fee

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే భూముల విధానాన్ని సవరించి, రైల్వేభూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. కౌలు కాలాన్ని కూడా ఐదేళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ వివరాలను తెలియజేశారు. రైల్వే భూమి విధానాన్ని సవరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రానున్న ఐదేళ్లలో 300 కు పైగా గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలని, రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీ ను 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. లీజు పీరియడ్‌ను ఐదేళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచేందుకు ఆమోదించారు. నూతన విధానం వల్ల కొత్తగా దాదాపు 1.2 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందని అనురాగ్ చెప్పారు. మరోవైపు రైల్వేలు కూడా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతాయని తెలిపారు.

భూమి లీజు కాలాన్ని పెంచడం వల్ల మరిన్ని కార్గో టెర్మినల్స్ నిర్మాణానికి, ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ మరింత ఆకర్షణీయం అవుతుందన్నారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని యాజమాన్య నియంత్రణను బదిలీ చేయాలని 2019 నవంబరులో కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 30.8 శాతం వాటాలు ఉన్నాయి. ఈ వాటాల అమ్మకం ద్వారా రూ.8000 కోట్లు సంపాదించాలని ప్రభుతం లక్షంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News