- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు బుధవారం రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్థన్ రిజైన్ చేశారు. ఇక ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా ఉన్న సదానందగౌడ సైతం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ కొత్త జాబితాపై ప్రకటన రానుందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ఉన్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అటు మోడీ మంత్రివర్గంలో 12 మంది దళితులకు చోటు దక్కింది. కేంద్రమంత్రి పదవులకు సదానందగౌడ, గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్ రాజీనామా చేశారు.
Union Health Minister harsh vardhan resigns
- Advertisement -