Saturday, April 20, 2024

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ వివాదం

- Advertisement -
- Advertisement -

Union Minister Kishan Reddy protocol controversy

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. తన పర్యటనకు అధికారులు రావడంలేదని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు.తన పర్యటనకు ఆర్డీవో స్థాయి అధికారి రావాలన్నారు. కనీసం ఎమ్మార్వోలు హాజరు కావడం లేదంటూ కిషన్ రెడ్డి ఆసహనం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి పర్యటనలో ఓ ఎమ్మార్వో పాల్గొన్నారు. అయితే, కిషన్ రెడ్డి గురువారం నగరంలోని రెడ్ హిల్స్, మల్లెపల్లి, షేక్‌పేట, హిమయత్ నగర్, ఖైర్‌తాబాద్, సోమజిగూడ పరిసర ప్రాంతాలను సందర్శించారు. ముంపు బాధితులకు ఆహారం, నీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Union Minister Kishan Reddy protocol controversy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News