Thursday, April 25, 2024

కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్‌ అంగాడి(65) కొవిడ్19తో బుధవారం కన్నుమూశారు. సెప్టెంబర్ 11న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. కర్నాటకలోని బెల్గాం లోక్‌సభ స్థానం నుంచి అంగాడి వరుసగా నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అంగాడీ కుటుంబానికి ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ ఆయన కుటుంబం, స్నేహితులతోనే ఉన్నాయని ప్రధాని ట్విట్ చేశారు. కర్నాటకలో పార్టీని(బిజెపిని) బలోపేతం చేయడానికి కఠినంగా శ్రమించారని ప్రధాని కొనియాడారు. కరోనాతో మరణించిన మొదటి కేంద్రమంత్రి అంగాడీనే.

Union Minister Suresh Angadi dies due to Corona

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News