Wednesday, April 24, 2024

యూనివర్శిటీలు పరీక్షలు నిర్వహించరాదు : కపిల్ సిబాల్

- Advertisement -
- Advertisement -

Universities should not conduct exams: Kapil Sibal

 

న్యూఢిల్లీ : కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో యూనివర్శిటీలు పరీక్షలు నిర్వహించరాదని, అలాగే పేద విద్యార్థుల పాలిట వివక్ష చూపిస్తూ ఆన్‌లైన్ ద్వారా నైనా పరీక్షలు జరపరాదని మాజీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌సిబాల్ ఆదివారం సూచించారు. పాఠశాలల్లో తరగతులు సరిగ్గా జరగక 202021 విద్యాసంవత్సరం దాదాపు సగం పూర్తయిందని, అందువల్ల పదో తరగతి పరీక్షలు వచ్చే సంవత్సరం కూడా నిర్వహించరాదని, పరీక్షలు జరిపితే విద్యార్థులపై అనవసరమైన భారం పడుతుందని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన యూనివర్శిటీ విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లి పోయారని, ఆయా ప్రాంతాల నుంచి వారు ఆన్‌లైన్ పరీక్షల్లో ఎలా పాల్గొంటారని ఆయన ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News