- Advertisement -
నిజామాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మాక్లూర్ మండలం ముల్లంగిలో గుర్తుతెలియని ఓ మహిళను దుండగలు తగలబెట్టారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళను అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Unknown Woman killed in Nizamabad
- Advertisement -