- Advertisement -
యుపి ప్రొఫెసర్ అలీ జైలుపాలు
ఫిరోజాబాద్ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై అభ్యంతరకర దిగజారుడు వ్యాఖ్యలకు దిగిన యుపికి చెందిన ప్రొఫెసర్ షాహార్యార్ అలీని జైలు పాలయ్యారు. ఫిరోజాబాద్లో కోర్టుకు ఆయన లొంగిపోవడంతో వెంటనే జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తప్పుడు వ్యాఖ్యలను ఈ ప్రొఫెసర్ ఫేస్బుక్లో పొందుర్చినట్లు పోలీసులు తెలిపారు. ఫిరోజాబాద్లోని ఎస్ఆర్కె కాలేజీలో హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్న అలీ ఈ ఏడాది మార్చిలో కేంద్ర మంత్రిపై అభ్యంతరక వ్యాఖ్యలకు దిగినట్లు ఫిర్యాదులు అందాయి. అరెస్టు నివారణకు, బెయిల్కు ఈ ప్రొఫెసర్ యత్నిస్తూ వచ్చారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీనితో కోర్టుకు సరెండర్ అయ్యారని వెల్లడైంది.
- Advertisement -