లక్నో: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అర్జున్ సింగ్ మోహినీ అనే దంపతులు ఉన్నారు. అర్జున్ సింగ్ తాగుడుకు బానిసకావడంతో భార్య సుర్జీత్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సంవత్సరం నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. రెడ్ హ్యాండడ్గా మోహినీ తన ప్రియుడితో కలిసి భర్తకు దొరికింది. భార్య తన ప్రియుడితో భర్తను గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. తన భర్త కనిపించడంలేదని ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు భార్యపై అనుమానం రావడంతో తనదైన శైలిలో ప్రశ్నించడంతో తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.