Wednesday, April 24, 2024

ఐదుగురు పిల్లలను నదిలో పడేసిన కసాయి తల్లి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని భాదోహి జిల్లాలో ఓ భార్య తన భర్తతో గొడవ పెట్టుకొని ఐదుగురు పిల్లల్ని నదిలో పడేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మంజు యాదవ్, మృదుల్ యాదవ్ అనే దంపతులు జహంగీరాబాద్ గ్రామంలో నివసిస్తున్నారు. గత సంవత్సరం నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి దంపతుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో భార్య తన పిల్లలను తీసుకొని గంగా నది ఒడ్డుకు వెళ్లింది. అనంతరం ఐదుగురు పిల్లలను గంగా నదిలో పడేసి అక్కడే కూర్చుంది. స్థానికుల సమాచారం మేరకు గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకొని రెండు మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎస్‌పి రామ్ బదన్ సింగ్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భార్య భర్తల మధ్య ఉన్న ఈ దారుణానికి కారణమని ఎస్‌పి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News