Thursday, April 25, 2024

ఉప్పల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Software Engineer

 

మేడ్చల్: ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం గణేష్ నగర్ లో నివాసముంటున్న జి.శ్రీనివాస్ రెడ్డి కుమారుడు జి.రంజిత్ కుమార్ రెడ్డి బెంగళూరులో  వీసా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రంజిత్ కుమార్ బెంగళూరులో తన రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతదేహాన్ని బెంగుళూర్ నుంచి ఉప్పల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గణేష్ నగర్ లో విషాదచాయలు అలుముకున్నాయి. రంజిత్ కుమార్ ఐఐటిలో చదువుతున్నప్పుడు టాపర్ గా ఉన్నాడు.  రంజిత్ మృతితో అతడి కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

Uppal Software Engineer commit Suicide in Bengaluru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News