- Advertisement -
ఢిల్లీ: తెలంగాణకు కేటాయించిన 1.77 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సదానందగౌడతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిపారు. వర్షాలు సకాలంలో పడడంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని, తెలంగాణకు కేటాయించిన 10.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి తెలిపారన్నారు.
- Advertisement -