అల్లు అర్జున్,- సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఊర్వశిని ఫైనల్ చేసిందట చిత్రబృందం. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్లను తీసుకుని ఈ సినిమా రేంజ్ను పెంచుతున్నారు. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్… ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. అలాగే ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్బస్టర్ తర్వాత బన్నీ ఏరి కోరి సైన్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.