- Advertisement -
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ 1నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం కానుంది. ప్రజలకు ఆరోజు నుంచే వ్యాక్సినేషన్ చేయించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలను ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం డల్లాస్ కు చెందిన హోల్ సేల్ వ్యాపార సంస్థ మెక్ కెసన్ కార్పొరేషన్ తో ఒప్పదం కుదుర్చుకుంది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఇప్పటికే అమెరికా రాష్ట్రాల గవర్నర్లకు సిడిసి డైరెక్టర్ రాబర్డ్ రెడ్ ఫీల్డ్ లేఖలు రాశారు. కాగా అమెరికాలో మొత్తం మూడు వ్యాక్సిన్ లు ఫేజ్-3 క్లినికల్ దశలోకి ప్రవేశించాయి. రాష్ట్రాలు, వైద్యారోగ్య విభాగాలకు మెక్ కెసన్ కార్పొరేషన్ టీకాలు సరఫరా చేయనుంది. నవంబర్ ఒకటి నాటికి కేంద్రాలన్నీ కార్యకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ట్రంప్ సర్కార్ సూచించింది.
- Advertisement -