Thursday, April 18, 2024

పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించాలి

- Advertisement -
- Advertisement -

US lawmaker seeks sanctions against Pakistan

వాషింగ్టన్ : పాకిస్థాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని దేశ చట్టసభ సభ్యులు అడమ్ కింజింగెర్ డిమాండ్ చేశారు. అఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటి కల్లోల పరిస్థితులలో పాకిస్థాన్ వహిస్తున్న పాత్రను బైడెన్ అధికార యంత్రాంగం అత్యంత జాగరూకతతో పర్యవేక్షించాలని ట్వీటు వెలువరించారు. పంజ్‌షీర్‌లో ప్రతిఘటన దళాలను అణచివేసేందుకు తాలిబన్లకు పాకిస్థాన్ బలగాలు పెద్ద ఎత్తున సాయం అందించడంపై అడమ్ స్పందించారు. తాలిబన్లకు ఈ లోయ ఆపరేషన్ దశలో పాకిస్థాన్ నుంచి 27 హెలికాప్టర్లు అందాయని, వీటిలో అత్యంత సుశిక్షితులైన ప్రత్యేక బలగాలు వచ్చాయని, తోడుగా పాకిస్థానీ డ్రోన్లతో దాడులు కూడా సాగించారని ఫ్యాక్స్‌న్యూస్ వార్త వెలువరించిన తరువాత చట్టసభ సభ్యులు స్పందించారు. కేవలం సాయం తాత్కాలికంగా నిలిపివేయడమే కాదు ఈ దేశాన్ని పూర్తిగా తీవ్రస్థాయి ఆంక్షల జాబితాలోకి తీసుకురావల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News