Thursday, April 25, 2024

భారత్‌కు రానున్న అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్

- Advertisement -
- Advertisement -

US Secretary of State Blinken to visit India

28న ప్రధాని మోడీ, జైశంకర్‌తో భేటీ

వాషింగ్టన్: అమెరికా విదేశాంగశాఖమంత్రి ఆంటోనీ బ్లింకెన్ వచ్చే వారం భారత్‌లో పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశం కానున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు బ్లింకెన్ జరిపే విదేశీ పర్యటనలో భాగంగా 28న ప్రధానితోపాటు జైశంకర్‌తో భేటీ అవుతారని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ తెలిపారు. అగ్రనేతలతో భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ,ప్రాపంచిక అంశాలపై బ్లింకెన్ విస్తృతంగా చర్చించనున్నారని ప్రైస్ తెలిపారు. కొవిడ్19ను ఎదుర్కోవడంలో ఇరు దేశాల మధ్య సహకారం, ఇండోపసిఫిక్ ప్రాంత సమస్యలు, ప్రాంతీయ భద్రత, వాతావరణ సంక్షోభంలాంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు ఆయన తెలిపారు. చర్చల అనంతరం అదేరోజు కువైట్ వెళ్తారని ప్రైస్ తెలిపారు. కువైట్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్లింకెన్ ఆ దేశంలో పర్యటించనున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 29న బ్లింకెన్ వాషింగ్టన్‌కు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News