Tuesday, April 23, 2024

కాంగ్రెస్ పార్టీ ముఖ్యులపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తూ పెట్టిన పోస్టింగుల వెనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యులే ఉన్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. తమపై ఎవరో పై నుండి పోస్టులు పెట్టించారన్నారు. తమ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టింగులు పెడుతున్నా రని విమర్శించారు. తమను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో చేసిన పోస్టింగుల వెనుక ఎవరున్నారో కొన్ని రోజుల తర్వాత వివరంగా చెబుతానన్నారు. ఏ ఎల్లిగాడో మల్లిగాడో ప్రశాంత్ పెట్టిన పోస్టులు కావని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి వంటి నేతలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన విషయం విదితమే.

ఈ విషయమై హైద్రాబాద్ సిపి సివి ఆనంద్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైద్రాబాద్ లో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై సోమవారం రాత్రి పోలీసులు దాడికి దిగారు. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ లోని కంప్యూటర్లను తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేయడంతో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ నుండి ఈ పోస్టింగ్ లు పెడుతున్నారని గుర్తించారు. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసి కంప్యూటర్లు తీసుకెళ్లారు. ఈ విషయమై యూత్ కాంగ్రెస్ నేత ప్రశాంత్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో సస్పెన్షన్‌కు గురైన యూత్ కాంగ్రెస్ నేత ప్రశాంత్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

ఈ విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి తన దృష్టికి తెచ్చారని ప్రశాంత్ మీడియాకు చెప్పారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పారు. ఈ విషయాలపై పోలీసుల విచారణకు సహకరిస్తామని మీడియాకు రెండు రోజుల క్రితం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News