Friday, March 29, 2024

మేం ఎవ్వరికీ గులాం కాదు : అంజన్‌కుమార్ యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో విభేదాలకు తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధిష్టానం దూత దిగ్విజయ్ సింగ్ పార్టీలోని ఏ సమస్యపైనైనా అంతర్గతంగా చర్చించాలని పార్టీ నేతలకు చేతులు జోడించి కోరుతున్నానని చెప్పారు. తెలంగాణలో సీనియర్ నేతలంతా సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ లో సీనియర్లు, జూనియర్లు అనే ప్రస్తావన సరికాదన్నారు. అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం ఆ మాటలను పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ ఎందుకు సంతృప్తి చెందారో ఆయననే అడగాలని అన్నారు. తమకైతే సంతృప్తి లేదని చెప్పారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ నాయకులకు న్యాయం జరిగినప్పుడే తమకు సంతృప్తి అని అన్నారు.

అసలైన కాంగ్రస్సోళ్లకు న్యాయం చేయాల్సిన అసవరం ఉందని దిగ్విజయ్ సింగ్‌కు చెప్పానన్నారు. కమిటీలో వేసినవారికి తీసేయకుండా.. పనిచేసిన పాతవారికి కూడా పదవులు ఇవ్వాలని తాను కోరుతున్నానని చెప్పారు. ఎక్కడైనా తాను ఇదే మాట చెబుతానని అన్నారు. జనసేన, టిడిపి కూడా రంగంలోకి దిగుతున్నాయని, వాటిని కూడా కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉందన్నారు. డ్యామేజ్‌ను కంట్రోల్ చేయకపోతే పదవులు దక్కనివారు వేరే తోవ చూసుకుంటారని అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికీ గులామ్ కాదని, పార్టీ ఎవరికి పదవి ఇస్తే వారితో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. తన కొడుకు అనిల్‌కు సికింద్రాబాద్ డిసిసి ఇస్తామంటే కొందరు అడ్డుపడుతున్నారన అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కోసం పనిచేయకుండా అనిల్ పదవులు అడిగాడా అని ఆయన ప్రశ్నించారు. పనిచేసే వాళ్లకు పదవులు ఇవ్వకపోతే ఎలా అని అంజన్ కుమార్ యాదవ్ నిలదీశారు. ఇకపోతే.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీకి విరుద్దంగా పనిచేస్తే మధుయాష్కి గౌడ్‌పై చర్యలు తప్పవని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారికిపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందేనని గ్రూపులు సమసిపోయాయని, అందరం కలిసే పనిచేస్తామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఇక, ఇటీవల కాంగ్రెస్‌లో పిసిసి కమిటీల ప్రకటన పెనుదుమారమే రేపిన సంగతి తెలిసిందే. అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని సీనియర్ నేతలు గళం వినిపించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు.

దీంతో వలస నేతలు వర్సెస్ ఒర్జినల్ కాంగ్రెస్ నేతలుగా సీన్ మారిపోయింది. ఈ క్రమంలోనే టిడిపి బ్యాగ్రౌండ్ ఉన్న దాదాపు 13 మంది నేతలు పిసిసి పదవులకు రాజీనామా చేయడంతో పార్టీలో సంక్షోభం మరింతగా ముదిరింది. ఈ క్రమంలోనే అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీలో పలువురు నేతలతో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీ నేతలతో సంప్రదింపుల అనంతరం మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ నాయకులందరితో మాట్లాడనని చెప్పారు. పార్టీలో సమస్యలు అన్నీ సర్దుకున్నాయని విభేదాలపై నాయకులు బయట మాట్లాడొద్దని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News