Friday, March 29, 2024

వైశాలి కిడ్నాప్ కేసు..సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. అతని వద్ద నుంచి వైశాలి కిడ్నాప్‌కు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టడటంతో పాటుగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. ఇక, నవీన్ రెడ్డి మూడు రోజుల పోలీసు కస్టడీకి జిల్లా కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు పోలీసులు నవీన్ రెడ్డిని విచారించనున్నారు.

ఇక, వైశాలి కిడ్నాప్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైశాలి నిశ్చితార్థం రోజే దాదాపు 40 మందితో ఆమె ఇంటికి వచ్చిన నవీన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు.నవీన్ రెడ్డితో వచ్చినవారు వైశాలి కుటుంబ సభ్యులపై దాడి చేయగా నవీన్ రెడ్డి ఆమెను తీసుకుని కారులో వెళ్లిపోయాడు. అయితే కొన్ని గంటల్లోనే పోలీసులు వైశాలిని క్షేమంగా రక్షించారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. నవీన్ రెడ్డికి ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో నవీన్ రెడ్డిని ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇబ్రహీం పట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒక్క రోజు మాత్రమే కస్టడీకి అనుమతించింది.

దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే జిల్లా కోర్టు శుక్రవారం నవీన్ రెడ్డిని మూడు రోజల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు శనివారం ఉదయం నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News