- Advertisement -
నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు వేద పండితులు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, సుప్రభాతం, హారతి నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యంలో భక్తులు రావడంతో రద్ది ఏర్పడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి.
Vasantha Panchami Celebrations begins at Basara
- Advertisement -