Tuesday, April 23, 2024

‘వినరో భాగ్యము విష్ణు కథ’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటించిన తాజా సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో సాయి ధరమ్‌తేజ్‌ విడుదల చేశారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతిరోజూ పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ’18 పేజెస్’ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న “వినరో భాగ్యము విష్ణు కథ” మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News