Friday, March 29, 2024

కేంద్రం కూడా రూ.10వేలు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

నష్టపరిహారం ఇవ్వని నాయకులకు పొలాల్లో పర్యటించే అర్హత లేదు
తడిసిన ధాన్యాన్ని కేంద్రం కొనకుండా కొర్రీలు పెడుతోంది
నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి వేముల
మన తెలంగాణ/మోర్తాడ్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో దెబ్బతిన్న నువ్వుల పంట, టమాటా, వరి పంటలను పరిశీలించి బాధిత రైతు సంతోష్ కు మనో ధైర్యం చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతుకు కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు మంత్రి భ రోసా కల్పించారు. కెసిఆర్ ఉండగా అన్నదాతల కు ఎలాంటి ఇబ్బందులు రానివ్వడని, నష్టపోయి న ప్రతి రైతుని ఆదుకుంటామని తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఎకరాకు 10వేల సహాయంతో రైతులకు అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతుందని కేంద్ర బిజెపి ప్రభుత్వ తీరుపై మం డిపడ్డా రు. రైతుల ధా న్యాన్ని తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వెకిలీ చేష్టలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగుమారిన ధాన్యం కొనమని చెప్తూ.. రైతుల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్ర చారం చే స్తున్నారని ధ్వజమెత్తారు. కొనకుండా అడ్డుకునేది వారే..రైతులను రెచ్చ గొట్టేది వారేనని బిజెపి తీరుపై నిప్పులు చెరిగారు. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవని అన్నారు. రైతు పక్షపాతి అయిన కేసిఆర్ పండిన పంటను అమ్ముకోవడానికి రైతు లు ఇబ్బందులు పడకూడదని ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పారు.

మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మొన్నటి వరకు ఉన్న కర్ణాటకలో గ్రామ గ్రా మాన కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయం, రైతు బీమాలతో కేసిఆర్ ప్రభుత్వం భరోసాగా నిలిస్తే బిజెపి కేంద్ర ప్ర భుత్వం రైతులతో దుర్మార్గంగా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిజెపి ద్వందవైఖరి పట్ల రైతులు ఆలోచన చేయాలని కో రారు. అదే విధంగా నష్టపోయిన పంటలకు కెసిఆర్ ఎకరానికి 10వేల ఇచ్చినట్లు కేంద్రం కూడా 10 వేలు ప్రకటించాలని మంత్రి వేముల సవాల్ చేశారు. రైతులకు ఎకరానికి 10 వేల పంట నష్ట సహాయం ప్రధాని మోడీ చేత ప్రకటించిన తర్వాతే బిజెపి నాయకులు రైతుల పొలాల్లో అడుగు పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News