ముంబై: ఆస్ట్రేలియా సిరీస్కు టీమిండియా ఎంపికలో సెలెక్టర్లు వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసంగా లేదని భారత మాజీ క్రికెటర్ దిలిప్ వెంగ్సర్కార్ విమర్శించాడు. జట్టు ఎంపికలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందన్నాడు. ముఖ్యంగా ముంబై క్రికెటర్లపై సెలెక్టర్లు చిన్నచూపు చూశారని ఆరోపించాడు. ఐపిఎల్లో నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ను ఆసీస్ సిరీస్కు ఎంపిక చేయక పోవడంపై వెంగ్సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంతో ప్రతిభావంతుడైన సూర్యకుమార్కు ప్రతిసారి నిరాశే ఎదురవుతుందన్నాడు. ఐపిఎల్లో అతని ఆటను చూస్తే ఆస్ట్రేలియా సిరీస్కు ఎంపికవుతాడని తాను భావించానని అయితే సెలెక్టర్లు మాత్రం మరోసారి నిరాశే మిగిల్చారని వాపోయాడు. మరోవైపు భారత సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Vengsarkar slams Selectors over Team India tour of Aus