న్యూఢిల్లీ: 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రంకోసం ప్రాణాలు అర్పించినవారి త్యాగాలను ఆయన స్మరించుకుంటూ ఇవాళ ట్వీట్ చేశారు. ”దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ. కుల, మత, లింగ వివక్షతలేని సమసమాజ స్థాపనకు కృషిచేస్తూ. పేద-ధనిక, గ్రామీణ-పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం.” అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ. కుల, మత, లింగ వివక్షతలేని సమసమాజ స్థాపనకు కృషిచేస్తూ. పేద-ధనిక, గ్రామీణ-పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం.#IndiaIndependenceDay pic.twitter.com/SY7vIWr28i
— Vice President of India (@VPSecretariat) August 15, 2020