Friday, March 29, 2024

ఆ హిట్ డైరెక్టర్‌తో మల్టీస్టారర్

- Advertisement -
- Advertisement -

 

వరుసగా సక్సెస్‌లతో దూసుకుపోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్ 2’ కు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి.. పరిస్థితులు అనుకూలిస్తే ‘ఎఫ్ 3’ని ఆగస్టులో విడుదల చేయాలని దర్శకుడు అనీల్ రావిపూడి ఆశ పడుతున్నాడు. ఇప్పటికే ఈ దర్శకుడు బాలయ్యతో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ చేసే పనిలో కూడా ఉన్నాడని ఇటీవల టాక్ వినిపించింది. రవితేజతో అనీల్ రావిపూడి చర్చలు జరిపిన నేపథ్యంలో రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ అయి ఉంటుందని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం రవితేజతో అనీల్ రావిపూడి చేయబోయేది సీక్వెల్ కాదట. రవితేజకు అనీల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ కథను చెప్పాడట. ఈ కథలో ఈ హీరోతో పాటు ఒక యంగ్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రవితేజ ఓకే చెప్పాడని తెలిసింది. ఎఫ్ 3 సినిమా మాదిరిగా సీనియర్ హీరో, యంగ్ హీరోల కాంబోలో అనీల్ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News