మనతెలంగాణ/సత్తుపల్లి: చెన్నై బ్యాంక్లో ఉద్యోగినిగా పనిచేస్తూ, దివ్యాంగుల జాతీయ స్థాయిలో నిర్వహించే ఈత పోటీల్లో మూడుసార్లు బంగారు పతకం సాధించిన పట్టణానికి చెందిన ప్రతిగడుపు మాధవీలతను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. సత్తుపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన పార్ధసారధిరాజు నాలుగో సంతానమైన మాధవీలత కుటుంబ ఉద్యోగ నిమిత్తం చెన్నైలో స్థిరపడింది. అయితే తాను అంగవైకల్యం కారణంగా ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలతో కూడిన జీవితానుభవాలను స్విమ్మింగ్ ఎగైనెస్ట్ ది టైడ్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఆమె జీవన పోరాటాన్ని, సాధించిన విజయాల గురించి తెలుసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెను స్వయంగా ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ఈ క్రమంలో ఇటీవల వెంకయ్యనాయుడు చెన్నైలో బస చేసిన సమయంలో మాధవీలత ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉప రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఆమెను అభినందించారు.
మాధవీలతను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -