Wednesday, April 24, 2024

సూపర్‌స్టార్ మూవీలో బాలీవుడ్ తార

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్,- 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో మిగతా లీడ్ యాక్టర్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మహేష్‌కి జోడీగా ‘మహానటి’ కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు తెలిసింది. ఇక ప్రతినాయకుడు పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి కనిపించబోతుందని తెలిసింది. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్‌కు సిస్టర్ క్యారక్టర్ ఉండగా.. అందుకోసం ‘డర్టీ పిక్చర్’ హీరోయిన్ విద్యాబాలన్‌ని సంప్రదిస్తున్నారట. కథలో కీలకమైన ఈ పాత్రలో ఆమె అయితేనే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీని కోసం మహేష్ అండ్ టీమ్ స్పెషల్ ఫ్లైట్‌లో అమెరికా వెళ్లనున్నారని సమాచారం.

Vidya Balan to play key role in Sarkaru vaari Paata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News