- Advertisement -
వికారాబాద్: జిల్లా టిఆర్ఎస్ మాజి ఎంఎల్ఎ సంజీవరావు మృతిచెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. సంజీవరావు ఆకస్మిక మృతిపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంజీవరావు కుటుంబ సభ్యులకు కెసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించినట్టు సిఎం పేర్కొన్నారు.
2014లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపు
గుండెపోటుకు గురైన సంజీవరావును నిమ్స్కు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. సంజీవరావు 2014లో వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపుపొందారు. ఆయన స్వస్థలం నవాబు పేట మండలంలోని గేటు వనంపల్లి.
Vikarabad Former MLA Sanjeeva Rao passed away
- Advertisement -