Thursday, April 25, 2024

నరేగా, పంచాయతీ నిధులతో వైకుంఠ ధామాలు, పారిశుద్ధ్యం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

 

Village clean with panchayati funds
జనగామ: పాలకుర్తిలో నిర్మిస్తున్న వైకుంఠ ధామాన్ని, మంచిప్పులలోని వైకుంఠ ధామం, నర్సరీలతో పాటు తొర్రూరులో పారిశుద్ధ్యం, కాలువలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.  పల్లె ప్రగతిలో భాగంగా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమం, నియంత్రిత పంటల సాగుపై మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. నరేగా నిధులతో, పంచాయతీ నిధులతో వైకుంఠ ధామాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, అధికారుల సమన్వయంతో గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News