Thursday, April 25, 2024

పోడు భూములపై గ్రామసభ, కమిటీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/లింగాపూర్‌: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ సుమలత రాథోడ్ అద్యక్షతన పోడు భూములపై గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరిదాస్ ముఖ్య ఆతిథిగా పాల్గోని యన ఆధ్వర్యంలో ఫారెస్ట్ కమిటీలు ఎన్నుకున్నారు. భూమి లేని వారు పోడు భూములు వ్యవసాయం చేస్తున్న రైతులు దరఖాస్తు ఫారం పూర్తి వివరాలలో కమిటికి సమర్పించాలని కోరారు. ఆ తరువాత సర్వే నిర్వహించి రైతులు అర్హులైన వారికి ఫారెస్ట్ పట్టాలు వస్తాయని అన్నారు. ఫారెస్ట్ కమిటి ఆధ్వర్యంలో పూర్తి విచారణ జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఆటవీ శాఖ ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News