Thursday, April 25, 2024

వినాయక చవితి శుభాకాంక్షలు: రాష్ట్రపతి, ప్రధాని

- Advertisement -
- Advertisement -

Vinayaka Chavati Greetings by PM, President

 

ఢిల్లీ: వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌పై దేశ ప్రజలు చేసే పోరాటంలో విజయం సాధించాలని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. అందరూ సంతోషంగా ఉండేవిధంగా దేవుడు దీవించాలని ప్రార్థన చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవాలని సూచించారు.

ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగ వినాయక చవితి అని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్దలతో పండుగ జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి ట్విట్ చేశారు.

వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ ముగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News