Saturday, April 20, 2024

విరాట్ కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

Virat Kohli Fined 12 lakh For Slow Over Rate

ముంబై: పంజాబ్ తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా పడింది. బౌలింగ్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో అతడికి రూ.12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఐపిఎల్ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఐపిఎల్ లో దాదాపు అన్ని మ్యాచ్ లు నెమ్మదిగానే సాగుతున్నాయి. మరోపక్క మ్యాచ్ ఓటమి, రెండు క్యాచ్ లు వదిలేయడం, కెప్టెన్సీ లోపాలు, జరిమానా కారణంగా విరాట్ కు నిన్న బ్యాడ్ డే అభిమానులు భాదపడుతున్నారు. హైదరాబాద్ జట్టుతో ఆడిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు గురువారం పంజాబ్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. కాగా ఆర్‌సిబి సెప్టెంబర్ 28న ముంబై ఇండియన్స్‌తో తలపడుంది.

Virat Kohli Fined 12 lakh For Slow Over Rate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News