Saturday, April 20, 2024

మహిళా నిందితులుకు కన్యత్వ పరీక్ష రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహిళా నిందితులకు కన్యత్వ పరీక్ష రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తెలిపింది. కన్యత్వ పరీక్షను నిర్వహించడం గౌరవ హక్కును ఉల్లంఘించడమే అని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కన్యత్వ పరీక్షకు ఎటువంటి శాస్త్రియ, ప్రక్రియలేదని విధంగా పరీక్షంచడం అమానుషంగా వ్యవహరించడమే అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మేరకు తీర్పును వెలువరించారు. 1992లో కేరళలో నన్ మృతికి సంబంధించి నమోదైన కేసులో నిందితురాలు సిస్టర్ సెఫీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. దర్యాప్తులో భాగంగా నిర్బంధంలో ఉన్న మహిళకు, నిందితురాలుకు, జ్యుడిషియల్ కస్టడీ లేదా పోలీసు కస్టడీలో ఉన్న నిందితురాలికి పరీక్ష నిర్వహించడం వ్యతిరేకం, రాజ్యాంగంలో ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమే అని జస్టిస్ శర్మ వెల్లడించారు.

కస్టడీలో ఉన్న మహిళా నిందితురాలికి అటువంటి పరీక్ష నిర్వహిస్తే మానవ హక్కును ఉల్లంఘించడంగా జస్టిస్ శర్మ పేర్కొన్నారు. ఒక వ్యక్తి నేరం చేసినట్లు ఆరోపణలు వచ్చినా లేదా అరెస్టు చేసినా నిందితుల గౌరవ రద్దు అవదు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ చట్టం ద్వారా నిర్దేశించిన ప్రకారం న్యాయంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. నిందితుడిని దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు రద్దు అవుతుంది. అయితే నిందితులు, అండర్ ట్రయల్‌లో ఉన్నవారి గౌరవ మాత్రం రద్దు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా 1992లో నన్ మృతికి సంబంధించిన కేసులో సిబిఐ దర్యాప్తు నెపంతో 2008లో తనకు కన్యత్వ పరీక్ష చేయించిందని, పరీక్ష ఫలితం లీక్ అయిందని పిటిషనర్ సెఫీ పిటిషన్‌లో ఆరోపించింది. పిటిషన్ విచారించిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం పరీక్ష రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News