- Advertisement -
మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, బయ్యన్నగూడెం, నాయకులగూడెం గ్రామాల సమీపంలోని ఓ పౌల్ట్రీలో శనివారం పెద్ద ఎత్తున ఫారం కోళ్ళు వైరస్ సోకి మృతిచెందాయి. పెనుబల్లి మండలానికి ఓ పౌల్ట్రీ యజమానికి చెందిన కోళ్లు గత వారం రోజుల నుండి వేలాది సంఖ్యలో మృతిచెందుతున్నాయి. మృతిచెందిన కోళ్ళను గ్రామ సమీపంలో పూడ్చిపెడుతుండటంతో గ్రామస్థులు అభ్యంతరం తెలిపి స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. శనివారం ఒక్కరోజే 30 వేల కోళ్ళు మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మండలంలో వారం రోజులుగా వివిధ వైరస్లు సోకి నివాస గృహాల్లో పెంచుకునే నాటుకోళ్ళు, ఫారం కోళ్ళు పెద్ద సంఖ్యలో మృతిచెందుతున్నాయి.
Virus killed 30 thousand Chickens
- Advertisement -