Friday, April 19, 2024

యువకుల శాడిజం.. 5వేల కోసం చిత్రహింసలు

- Advertisement -
- Advertisement -

Tortured

అమరావతి: విశాఖ జిల్లాలోని మధురవాడలో దారుణం చోటుచేసుకుంది. నలుగురు యువకులు తమ శాడిజాన్ని బయటపెట్టారు. దంతేశ్వరరావ్‌ అనే యువకుడు స్నేహితుల దగ్గర 5వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. తిరిగి అడిగితే ఇప్పుడు లేవు. కొంత సమయం పడుతుందన్నాడు. దీంతో కోపంలో రెచ్చిపోయిన స్నేహితులు ఆ యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదుతూ, అసభ్యకరంగా ప్రవర్తించారు.

బాధిత యువకుడు బైక్ కొని డబ్బులు చెల్లించలేదని చెట్టుకు కట్టేసి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ అమానుష ఘటన మారికవలసలోని రాజీవ్ గృహకల్పలో జరిగింది. బాకీ కోసం చిత్రహింసలు పెట్టిన వీడియో కాస్తా వైరల్ అయి పోలీసులకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విశాఖ పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. బాధితుడి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితులపై ఐపిసి 352,506,323 సెక్షన్ల కింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Vishakha Young Man Tortured by 5 Friends

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News