Friday, March 29, 2024

దుబ్బాకలో 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదు

- Advertisement -
- Advertisement -

Voting for by-Elections underway in Dubbaka

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాధారణ ఓటర్లు సాయంత్రం 5గంటల వరకు ఓటేసేందుకు ఇసి అవకాశం కల్పించింది. కోవిడ్ రోగులకు సాయంత్రం ఐదుగంటల నుంచి 6గంటల మధ్య ఓటు వేసేలా ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భౌతికదూరం పాటించేలా ప్రత్యేక గుర్తులను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. అలాగే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరును స్క్రీనింగ్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం లక్ష 98వేల 756 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 315 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అటు దుబ్బాక మండలం చిట్టాపూర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓటు వేశారు.

Voting for by-Elections underway in Dubbaka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News