మన తెలంగాణా/జఫర్గడ్ : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ మండలానికి చెందిన వివిధ గ్రామాల విఆర్ఎలు బుధవారం స్థానిక తహసీల్దార్ స్వప్నకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కడ్గావ్కు చెందిన విఆర్ఎ గౌతమ్ను ఇసుక రవాణా అడ్డుకున్నందుకు కొట్టి హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలన్నారు. చాలీ చాలనీ జీతాలతో విఆర్ఎలు కాలం వెల్లదీస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేస్కేల్ అమలు కాకా పలువురు విఆర్ఎలు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. జాబ్ చార్ట్, సమయ పాలన లేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణమే ప్రభుత్వం విఆర్ఎల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విఆర్ఎలు కుల్లా కర్ణాకర్, రవి ఎడ్ల, రాజా రమేశ్, నరేందర్, శ్రీకాంత్, క్రిష్ణ, యాకయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.