Saturday, April 20, 2024

భావోద్వేగానికి గురయ్యా

- Advertisement -
- Advertisement -

VVS Laxman says he got 'emotional' when India beat Australia

 

• వివిఎస్.లక్ష్మణ్

ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించగానే తాను ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యానని భారత మాజీ దిగ్గజం వివిఎస్. లక్ష్మణ్ తెలిపాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ టీమిండియా ఆఖరి టెస్టులో సాధించిన చారిత్రక విజయం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం అంత తేలికేం కాదన్నాడు. ఇక కీలకమైన ఆటగాళ్లు దూరమైన వేళ యువ ఆటగాళ్లు అసాధారణ పోరాట పటిమతో జట్టుకు చిరస్మరణీయ విజయం అందించడం దేశానికే గర్వకారణమన్నాడు. అసలు ఆఖరి మ్యాచ్‌ను డ్రాగా ముగించినా అదే గొప్ప అని భావించిన స్థితిలో యువ జట్టు ఏకంగా విజయమే సాధించడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయిందన్నాడు. గెలుపు వార్త తెలియగానే కళ్లలో నీళ్లు తిరిగాయని లక్ష్మణ్ ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో వివరించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News