Friday, April 19, 2024

‘వాల్తేరు వీరయ్య’ 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవితో కలసి మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రోజురోజుకు కలెక్షన్లు పెరిగాయి. ఇదిలావుండగా, ఈ సినిమా ఈరోజుతో 70 డైరెక్ట్ సెంటర్లలో,  ఓవరాల్ గా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇది ఖచ్చితంగా గొప్ప విజయమే, ఏ సినిమా అయినా లాంగ్ రన్ ఇవ్వడం ఛాలెజింగ్ టాస్క్.

వింటేజ్ మెగాస్టార్ ని చూపించడంతో పాటు, రవితేజను ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ప్రజంట్ చేసి అందరి మనసుని గెలిచుకున్నాడు దర్శకుడు బాబీ కొల్లి. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మెగా బడ్జెట్‌తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News