Friday, March 29, 2024

250 కోట్ల కలెక్షన్స్‌కు చేరువలో ‘వాల్తేరు వీరయ్య’

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) మెగా మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ‘వీరయ్య విజయ విహారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను హన్మకొండలో గ్రాండ్‌గా నిర్వహించింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రత్యేక అతిధిగా హాజరైన ఈ వేడుకలో మంత్రి దయకర్‌రావు, బాబీ కొల్లి, నవీన్ యెర్నేని, బివిఎస్ రవి, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాం కానీ నాన్ బాహుబలి, నాన్ ఆర్‌ఆర్‌ఆర్ స్థాయి సినిమా అవుతుందని మేము ఊహించలేదు. వాల్తేరు వీరయ్య 250 కోట్ల గ్రాస్‌కి చేరబోతుందంటే అది ఆషామాషీ విషయం కాదు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా మళ్ళీ తెరపై చూస్తూ ఒక ఘరానామొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఇలాంటి ఫీలింగ్ మీకు నాకు కలిగించడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ’ అని అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య చూశాను ప్రతి ఫ్రేంని అద్భుతంగా మలిచారు బాబీ. ఈ సినిమాలో చిరంజీవి గారు మా నాన్న గారిలా లేరు.. మా బ్రదర్‌లా ఉన్నారు. నేను ఇక్కడికి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News