- Advertisement -
ముంబయి: వైద్యురాలితో వార్డు బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరం జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గజేంద్ర గోస్వామి(45) అనే వార్డు బాయ్ ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలుతో అసభ్యంగా ప్రవర్తించడంతో సీనియర్ డాక్టర్లకు ఫిర్యాదు చేసింది. సదరు వైద్యురాలు మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ముంబయిలో జూన్ 20న క్వారంటైన్ సెంటర్లో ఉన్న అమ్మాయితో ఆస్పత్రిలో పని చేసే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై ఐపిసి 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
- Advertisement -