Saturday, April 20, 2024

రికార్డు బద్దలుకొట్టిన వాషింగ్టన్ సుందర్

- Advertisement -
- Advertisement -

ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్ రికార్డు సృష్టించాడు. తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఏడో స్థానంలో వచ్చిన వాషింగ్టన్ 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యంత వేగంగా 30పైగా పరులుగు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2009లో సురేష్ రైనా 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రెండో వన్డే హామిల్టన్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. రేపు వర్షం వచ్చే అవకాశాలు ఉండడంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News