Tuesday, April 23, 2024

జులై నెలలో నీటిని వదలడం ఇదే మొదటిసారి: పోచారం

- Advertisement -
- Advertisement -

Water released from Nizam sagar project

కామారెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితాలను మన చూస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు స్పీకరం పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా 1.5 టిఎంసిల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి లిఫ్ట్ చేశారన్నారు. రెండు పంటలకు నీళ్లు ఇవ్వాలని సిఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారని ప్రశంసించారు. జులై నెలలో నీటిని వదలడం ఇదే మొదటి సారి అని పోచారం కొనియాడారు. కాళేశ్వరం నుంచి మరో రెండు టిఎంసిల నీటిని నిజాంసాగర్‌లోకి లిఫ్ట్ చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజాంసాగర్ నుంచి సాగునీటిని విడుదల చేసినందుకు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి బిబి పాటిల్, ఎంఎల్‌ఎ హన్మంత్ షిండే పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News