Thursday, April 25, 2024

రేపు నగరంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: హైదరాబాద్ మహనగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణాడ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 3 రింగ్ మెయిన్‌కు సంబంధించి 1500 ఎంఎండయా పైపులైన్ మరమ్మత్తు కారణంగా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ మరమ్మత్తు పనులు శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంటే 12 గంటల పాటు నీటిసరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే…

19 డివిజన్ పరిధిలోని బోడుప్పల్, చెంగిచర్ల, పీర్జాదిగూడ, ప్రాంతాలు అదే విధంగా డివిజన్ 21 పరిధిలోని సైనిక్‌పురి, అల్వాల్, డివిజన్ 13లోని మౌలాలి, డివిజన్ 7లోని లాలాపేట, తార్నాక, డివిజన్ 14లో స్నేహపురి ,కైలాసగిరి, చర్లపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, వారికి కలిగే ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News